ఎగ్జామ్స్ టైమ్ వచ్చేసిన నేపథ్యంలో ప్రధాని మోదీ విద్యార్థులతో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ’ ఎపిసోడ్ ఫిబ్రవరి 6న టెలికాస్ట్ కానుంది.
ఇటీవల ఢిల్లీ, కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటి, దేవ్మొగ్ర ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.
పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడం, కూల్గా ఎగ్జామ్స్ రాయడంపై వారికి సూచనలిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

