telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వ అసమర్థత వల్లే కోహెడ మార్కెట్ కుప్పకూలింది: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తెలంగాణ ప్రభుత్వం అసమర్థత వల్ల కొహెడలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ ఈదురుగాలులకు నేలమట్టం అయ్యిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కొహెడ పండ్ల మార్కెట్ ను ఆయన ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మార్కెట్ లో ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా కొత్తపేట నుండి కొహెడకి తరలించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.

ఈ ఘటనకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలన్నారు. షెడ్లు కూలి గాయాల పాలైన వారికి మెరుగైన వైద్యం అందించి, నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మార్కెట్ సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులు నాసిరకం షెడ్లు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts