telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నారా లోకేశ్‌ అరెస్ట్‌

గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వచ్చిన సందర్భంగా గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆరోపించాయి. ఈ క్రమంలో టీడీజీ-వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేపట్టారు. అనంతరం లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తీసుకెళ్లారు. టీడీపీ నేతల అరెస్టులను ఆ పార్టీ నేతలు ఖండించారు. పోలీసుల తీరును టీడీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.

Related posts