telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నంద్యాల జనసేన అభ్యర్థికి అస్వస్థత

నంద్యాల జనసేన అభ్యర్థి, సిటింగ్‌ ఎంపీ ఎస్‌.పి.వై.రెడ్డి ఎన్నికల ప్రచారంలో  తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహటిన ఆయనను హైదరాబాద్‌ తరలించారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే తెలుగుదేశం పార్టీలోకి జంపయ్యారు. 
అప్పటి నుంచి టీడీపీలో  కొనసాగుతున్న ఆయన తాజా ఎన్నికల్లో మళ్లీ నంధ్యాల టికెట్టు ఆశించారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించడంతో  ఎస్‌.పి.వై.రెడ్డి  జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఓట్లు చీలుతాయన్న ఉద్దేశంతో ఆయనను చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ సీటిస్తానని చెప్పినప్పటికీ  ఆయన మనసు మార్చుకోలేదు. దీంతో నంద్యాల నుంచి మరోసారి ఎస్‌.పి.వై.రెడ్డి బరిలోకి దిగారు.

Related posts