telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గోవాలో ఆ పిచ్చితో అంతా పోగొట్టుకున్నా… శ్రీముఖి కామెంట్స్

Srimukhi

బుల్లితెర యాంకర్‌గా ‘పటాస్’ షోతో ఫుల్ ఫేమస్ అయిన బ్యూటీ శ్రీముఖి. ఆ తర్వాత ‘బిగ్ బాస్ 3’ ఛాన్స్ పట్టేసి తెగ హంగామా చేసింది. విన్నర్ అవుతుందనుకుంటే చివరకు రన్నర్ ట్రోఫీతోనే సర్దుకుంది. మాటల గారడీ చేస్తూ మంచి ఫాలోయింగ్ కూడగట్టుకున్న శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. ఇక లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ కావడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు పలు ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీముఖి.. గోవాలో తనకు ఎదురైన చేదు అనుభవాల సంగతులు చెప్పింది. తనకు కసీనో గేమ్ అంటే చాలా చాలా పిచ్చి ఉండేదని, ఆ కారణంగా గోవాలో చాలా డబ్బును కోల్పోయానని చెప్పుకొచ్చింది శ్రీముఖి. కసీనో గేమ్ మీద ఉన్న పిచ్చితో గోవా వెళ్లేదాన్నని, అదే తనకు చేదు అనుభవాలు మిగిల్చిందని ఆమె పేర్కొంది. ఫస్ట్ టైమ్ గోవా వెళ్లినప్పుడు కసీనో గేమ్ ఆడితే డబ్బులు వచ్చాయని, దాంతో రెండోసారి, మూడోసారి వెళ్లినప్పుడు కూడా అదే చేసి చేతులు కాల్చుకున్నానని చెప్పింది. ఉన్న డబ్బంతా పోవడంతో అప్పటి నుంచి ఆ గేమ్‌కు దూరంగా ఉంటున్నానని తెలిపింది శ్రీముఖి. బుల్లితెరతో పాటు సిల్వర్ స్క్రీన్ జర్నీ కూడా చేస్తున్న శ్రీముఖి ప్రస్తుతం ‘ఇట్స్ టైమ్ టు పార్టీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే విడుదలైన ఆమె లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Related posts