telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బండి సంజయ్, అరవింద్ లకు ప్రజలు సరైన బుద్ధి చెప్తారు

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిదిలో 89 లక్షల వ్యయం తో పైపు లైన్ ఆధునీకరణ, 30 లక్షలు సీసీ రోడ్, 1.76 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎంపీ బడుగుల యాదవ్ మాట్లాడారు. నిన్నటి రైతు నిరసన చూసైనా బిజెపి నాయకులకు బుద్దితెచ్చుకోవాలని…బిజేపి ఎంపీలు బండి సంజయ్, అరవింద్ మాటలు స్థాయిని మించిపోతున్నాయని ఫైర్‌ అయ్యారు. దేశం మొత్తం కూడా రైతుల పై రుద్దుతున్నా నల్ల చట్టాన్ని ఎత్తివేయాలంటూ ఉన్నారని… సిఎం కేసిఆర్ చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను చూసైనా బిజెపి నాయకులు జ్ఞానం తెచ్చుకోవాలని హితురు పలికారు. బిజెపి పెట్టిన రైతు వ్యతిరేక చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు కాదని.. రద్దు చేసేవరకు రైతులు ఉద్యమం చేస్తూనే వుంటారు…రైతు సంక్షేమం కోసం మా పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. నాలుగు సీట్లు సాధించినంత మాత్రాన ప్రజల్లో గొప్ప ఆదరణ ఉందనుకుంటే అది భ్రమ మాత్రమేనని… ఎంపీ లు బండి సంజయ్, అరవింద్, రానున్న రోజుల్లో వారికి సరైన బుద్ధి చెప్తారని తెలిపారు.

Related posts