telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అందుకే జగన్ ను హైదరాబాద్ నుంచి కేసీఆర్ తరిమేశారు: రాజేంద్రప్రసాద్

tdp leader rajendraprasad fire on ycp

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విరుచుకుపడ్డారు. ఈ నెల 23న జగన్ కు పరాజయం తప్పదన్నారు. ఏపీలో 20 ఎంపీ, 120 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారని అన్నారు. ఈ విషయం తెలిసే జగన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి అమరావతికి తరిమేశారని వ్యాఖ్యానించారు.

 మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్, విజయసాయి రెడ్డిలను చంచల్ గూడ జైలుకు పంపుతామని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుకు కేవీపీ రామచంద్రరావు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి విషపు సాయిరెడ్డిలా మాట్లాడుతున్నారని రాజేంద్రప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యవహారంలో చీఫ్ సెక్రటరీ జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల విధానం పారదర్శకతంగా ఉండాలని డిమాండ్ చేశారు. 

Related posts