telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు తీరు చాలా నీచంగా ఉంది: ఉండవల్లి శ్రీదేవి

undvalli sridevi ycp mla

చంద్రబాబు తీరు చాలా నీచంగా ఉందని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. రిటైర్ట్ జడ్జ్ ఈశ్వరయ్య ఓ జూనియర్ జడ్జితో మాట్లాడిన విషయాలపై రాద్ధాంతం చేశారని అన్నారు. ఈ అంశాన్ని హైకోర్టుకు పంపించి వారికి కూడా సందేహాలు వచ్చేలా చేశారని శ్రీదేవి మండిపడ్డారు.

గతంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ఎన్నో పనులను చంద్రబాబు చేశారని అన్నారు. చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆయనను పొగిడిన తీరును చూసి బీజేపీ నేతలు సైతం విస్తుపోతున్నారని అన్నారు. టీడీపీ ప్రజాక్షేత్రంలో గెలిచే అవకాశం లేదనే విషయం చంద్రబాబుకు తెలిసిపోయిందన్నారు. అందుకే వివిధ కుట్రలకు తెరలేపారని ఫోన్ ట్యాంపింగ్ జరుగుతోందంటూ చంద్రబాబు లేఖ రాయడం కూడా ఈ కుట్రలో భాగమేనని చెప్పారు.

Related posts