అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ హాల్లోకి ఫోన్లు తీసుకురావద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీచేశారు. ఫోన్ల అనుమతిపై నిషేధం విధిస్తున్నామన్నారు.
ఈ నెల 19న అసెంబ్లీలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేసిన సన్నివేశాన్ని సహచర ఎమ్మెల్యే వీడియో రికార్డుచేయడంతో అక్కడ ఏం జరిగిందనే అంశం టీవీఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో విశేష ప్రాచుర్యం కల్పించారు. దీంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.