telugu navyamedia
సినిమా వార్తలు

“కౌసల్య కృష్ణమూర్తి” కోసం ముఖ్య అతిథిగా మిథాలీ రాజ్

Kausalya-Krishnamurthy

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం “కౌసల్య కృష్ణమూర్తి”. ది క్రికెటర్‌ అనేది టాగ్‌లైన్‌. ఐశ్వర్యా రాజేష్‌, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌, టీజర్ తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. పల్లెటూరిలో రైతులు ఎదుర్కొనే కష్టాలు, క్రికెటర్ కావాలనుకునే యువతి ఆమె కోరికను ఏ విధంగా నెరవేర్చుకుంది అనేది చిత్ర కథాంశం. ఈ నేపథ్యంలో జులై 2న హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహిళా స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్, హీరోయిన్ రాశి ఖన్నా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మిథాలీ రాజ్ మొదటిసారి సినిమా ఈవెంట్ కు రానుండడంతో ఆసక్తి నెలకొంది.

Related posts