telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ కు విలన్ గా తమిళ స్టార్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ కథానాయికగా చేస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశాలతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే షూటింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు ప‌రశురామ్. అయితే ఈ మధ్యే ఈ చిత్రబృందం దుబాయ్ షెడ్యూల్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాలు, మ‌హేశ్, కీర్తిసురేష్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించింది చిత్ర యూనిట్‌.  అయితే ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఇప్పటివరకు పలువురు స్టార్స్ మహేష్ కు విలన్ గా నటించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ జాబితాలో తమిళ నటుడు అరవింద్ స్వామి, కన్నడ స్టార్ ఉపేంద్రల పేర్లు ఉన్నాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం మరో తమిళ స్టార్ పేరు తెరపైకి వచ్చింది. తమిళ స్టార్ మాధవన్ ‘సర్కారు వారి పాట’లో మహేష్ కు విలన్ గా నటించబోతున్నారట. అయితే ఇందులో నిజం ఎంతో చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేగానీ తెలీదు. మాధవన్ ఇప్పటికే తెలుగులో నాగచైతన్య ‘సవ్యసాచి’, అనుష్క ‘నిశ్శబ్దం’ చిత్రాల్లో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు పోషించారు.

Related posts