telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

టాలీవుడ్ లో మరో విషాదం : కోవిడ్ -19 తో దర్శకుడు మృతి

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే తాజాగా సినిమా దర్శకుడు, రచయత ఎన్ . సాయి బాలాజీ ప్రసాద్ (ఎన్. వర ప్రసాద్ ) కోవిడ్ -19 తో హైదరాబాద్, గచ్చ్చిబౌలి లోని టిమ్స్ లో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారు ఝామున మరణించారు. ఆయన వయసు 57.
రియల్ స్టార్ శ్రీహరి నటించిన “శివాజీ”, “ఒరేయ్ తమ్ముడు“ చిత్రాలకు దర్శకుడిగా సాయి బాలాజీ ప్రసాద్ పనిచేశారు. ”సిరి”, “అపరంజి” “హాలాహలం”. సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. ఇక ఆయన మృతి పట్ల సినిమా, టివి రంగాలకి చెందిన పలువురు సంతాపం తెలిపారు.

Related posts