అనంతపురం లో ఈ రోజు ఏపీ మంత్రి పర్యటనలో ఊహించని ఘటన జరిగింది. ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకర్ నారాయణ పర్యటనలో పాము కలకలం రేపింది. సోమవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి శంకర్ నారాయణ కు ప్రజలు తమ సమస్యలు విన్నవించుకున్నారు. అనంతరం మంత్రితో ప్రజలు మాట్లాడుతున్న సమయంలో ఎక్కడినుంచో ఓ పాము దూసుకొచ్చింది. అక్కడ నిలబడి ఉన్న ఓ వ్యక్తి కాళ్ల దగ్గరకు పాము వచ్చింది. ఊహించని ఈ ఘటనతో సదరు వ్యక్తి సహా అక్కడే ఉన్న వారు పరుగులు తీశారు. పక్కనే ఉన్న పొదల్లోకి పాము వెళ్లిపోయింది. పాము అక్కడికి వచ్చిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంత్రిని అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.

