telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ నుంచి ఒక్క కంపెనీ కూడా పోదు: మంత్రి గౌతమ్‌రెడ్డి

gaoutham reddy ycp

ఏపీ నుంచి కియా మోటార్స్ తరలిపోతోందనే వార్త ప్రకంపనలు పుట్టిస్తోంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ ప్లాంటును తమిళనాడుకు తరలించే యోచనలో ఆ సంస్థ ఉందని రాయిటర్స్ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి స్పందించారు. కియా పరిశ్రమ ఎక్కడికి వెళ్లదనితెలిపారు.

ఏపీ నుంచి వెళ్తుందన్న దుష్ప్రచారంపై కియా కంపెనీ లీగల్‌ యాక్షన్‌ ఆప్షన్‌ను పరిశీలిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కంపెనీ కూడా పోదని, ఆ పరిస్థితి రానివ్వమని తెలిపారు. అన్ని పరిశ్రమలకూ ఒకేరకమైన రాయితీలు ఇవ్వకూడదన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. పరిశ్రమ స్థాయి, ఉపాధి అవకాశాలను పరిగణలోకి తీసుకుని ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది తమ ఆలోచన అని మంత్రి చెప్పారు.

Related posts