ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ టాలీవుడ్ ఓ సాంగ్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు కోటి ఓ ప్రత్యేక గీతాన్ని ట్యూన్ చేయగా.. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు యంగ్ హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఆలపించారు. ఈ పాటకు మోది సైతం అభినందించారు. తాజాగా మెగాస్టార్ తన ఫ్యామిలీతో కలిసి కరోనా వైరస్ పై ఓ సందేశం ఇచ్చారు. ‘ ఇంట్లో యుద్ధం చేద్దాం. భారతీయులం ఒక్కటై భారత్ని గెలిపిస్తాం’ అంటూ ప్లకార్డులతో కుటుంబసభ్యులంతా ఫోటోలు దిగి స్టే హోమ్ అంటూ ఓ మెసేజ్ ఇచ్చారు. ప్లకార్డులు ప్రదర్శించిన వారిలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా కనిపించింది. ప్లకార్డులు ప్రదర్శించిన వారిలో…. చిరంజీవి, అల్లు అరవింద్ , నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్, చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ కూడా ఉన్నారు. ఈ ఫోటోల్ని కూడా ఎవరింట్లో వాళ్లు ఉంటూ షూట్ చేసి పోస్టు చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మనమంతా కలిసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుద్దాం. ‘మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉందాం. మనతో పాటు మన ప్రియమైనవారిని రక్షిద్దాం’ అని చిరు తన ట్వీట్లో పేర్కొన్నారు.
Together we WILL WIN this War!
Let us STAY where we are.
Let us keep ourselves,our dear ones and the world safe.#SimpleStepsToWinAMightyWar#UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/PXys8AE6JB— Chiranjeevi Konidela (@KChiruTweets) April 15, 2020