telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంట్లోనే ఉంటూ కరోనాను తరిమికొడదాం… మెగా ఫ్యామిలీ మెసేజ్

mega

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ టాలీవుడ్‌ ఓ సాంగ్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు కోటి ఓ ప్రత్యేక గీతాన్ని ట్యూన్‌ చేయగా.. మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జునతో పాటు యంగ్‌ హీరోలు వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఆలపించారు. ఈ పాటకు మోది సైతం అభినందించారు. తాజాగా మెగాస్టార్ తన ఫ్యామిలీతో కలిసి కరోనా వైరస్ పై ఓ సందేశం ఇచ్చారు. ‘ ఇంట్లో యుద్ధం చేద్దాం. భారతీయులం ఒక్కటై భారత్‌ని గెలిపిస్తాం’ అంటూ ప్లకార్డులతో కుటుంబసభ్యులంతా ఫోటోలు దిగి స్టే హోమ్ అంటూ ఓ మెసేజ్ ఇచ్చారు. ప్లకార్డులు ప్రదర్శించిన వారిలో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా కనిపించింది. ప్లకార్డులు ప్రదర్శించిన వారిలో…. చిరంజీవి, అల్లు అరవింద్ , నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయిధరమ్ తేజ్ , వైష్ణవ తేజ్, చిరంజీవి చిన్నకూతురు శ్రీజ, అల్లుడు కల్యాణ్ కూడా ఉన్నారు. ఈ ఫోటోల్ని కూడా ఎవరింట్లో వాళ్లు ఉంటూ షూట్ చేసి పోస్టు చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మనమంతా కలిసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుద్దాం. ‘మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉందాం. మనతో పాటు మన ప్రియమైనవారిని రక్షిద్దాం’ అని చిరు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts