కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై యంగ్ హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో శేఖర్ రెడ్డి ఎర్రా తెరకెక్కిస్తున్న చిత్రం “90ఎంఎల్”. కార్తికేయ సొంత బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రానికి అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేహా సోలంకి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. అలీ, పోసాని, రావురమేష్, రవి శంకర్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సందీప్ కిషన్, దర్శకుడు అజయ్ భూపతి పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వేడుకలో కార్తికేయ స్టేజ్పై దుమ్మురేపే స్టెప్స్ వేశాడు. ఆయనతో పాటు సందీప్ కిషన్ కూడా అందరిలో జోష్ నింపేలా స్టెప్స్ వేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మేడలో వైరల్ గా మారింది.
next post
కర్ణాటక, గోవా రాజకీయ సంక్షోభంపై చిదంబరం స్పందన