ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలోని పాటలు ఆదరణ పొందడం విశేషం. ఈ చిత్రం హిందీలో రీమేక్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు హిట్ ‘అర్జున్రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’కి ఒక నిర్మాతగా ఉన్న అశ్విన్ వార్దే ‘అల.. వైకుంఠపురములో..’ హిందీ రీమేక్ రైట్స్ను దక్కించుకున్నారని సమాచారం. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ రీమేక్ ను త్వరలో పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ రీమేక్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ రీమేక్ లో కియారా అద్వానీని తీసుకున్నట్లు వార్తలు ప్రచారం జరిగింది. కానీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనుందట. కియారా అద్వానీ పారితోషికం విషయంలో లేదా డేట్ల విషయంలో సెట్ అవ్వక పోవడం వల్లే ఆమె స్థానంలో జాన్విని ఎంపిక చేసినట్లుగా బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
previous post