భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సౌరవ్ గంగూలీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. సౌరవ్ గంగూలీకి ఛాతీ నొప్పి రావడంతో కోల్కతాలోని అపోలో ఆస్పత్రి తరలించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన గంగూలీ.. బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మధ్యే సౌరవ్ గంగూలీకి గుండె పోటు రావడంతో కోల్కతాలోని వుడ్ల్యాండ్ ఆస్పత్రిలో ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే గంగూలీ… తర్వాత డిశ్వార్జ్ అయి ఇంటికి వచ్చారు. తాజాగా మరోసారి సౌరవ్ గంగూలీ ఆస్పత్రిలో చేరారు. ఈ వార్త వినగానే కుటుంబ సభ్యులతో సహా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
previous post
సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు