తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య శాఖలో పోస్టులు భర్తీకీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్టు పద్ధతిన 85 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనాకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులు గాంధీ, టిమ్స్లో సేవలందించేందుకు నియామకాలు చేపడుతున్నామని వివరించింది. జనరల్ మెడిసిన్ విభాగంలో 35, అనస్థీషియా విభాగంలో 35, టీబీ అండ్ సీడీలో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 17న కోఠిలోని డీఎంఅండ్హెచ్ఎస్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపింది.