telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎస్సై కొట్టాడని ఆత్మహత్యాయత్నం…

తెలంగాణ, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన మొండి అశోక్ అనే యువకుడిని వేంసూరు ఎస్సై సాయి కుమార్ చితకబాదడంటూ మనస్థాపానికి గురై నిన్న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం ముందు సత్తుపల్లి ప్రైవేటు ఆసుపత్రి కి తరలించారు. కానీ పరిస్థితి  విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు. వివరాల్లోకి వెళ్తే వేంసూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలికతో 28 ఏళ్ళ అశోక్ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. మైనర్ బాలిక, అశోక్ కొన్ని నెలల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే మైనర్ బాలిక మూడు నెలల గర్భవతి కావడంతో బాలిక తల్లిదండ్రులు వేంసూరు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అశోక్ ని ఆ ఏరియా ఎస్సై స్టేషన్ కు పిలిపించి చితకబాదాడని దీంతో నస్థాపానికి గురై పురుగుల మందు తాగానని అశోక్ ఆరోపిస్తున్నాడు. వేంసూరు ఎస్సై  ప్రోత్సాహంతో,బాలిక బంధువులతో కలిసి నాకు పెళ్లి చేశారు.ఆ గర్భానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టి నాకు మైనర్ బాలిక తో పెళ్లి చేశారు అని అశోక్, అశోక్ తల్లి అంటున్నారు.

Related posts