telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

ఏపీకి వచ్చేవారిపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ap high court

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు బయల్దేరిన విద్యార్థులను సరిహద్దు వద్ద ఏపీ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ ప్రజలను నిలిపివేయడంపై బీజేపీ నేత వెలగపూడి గోపాలకృష్ణ  ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణ ఇచ్చిన ఎన్ఓసీని ఎంట్రీ పాయింట్ లోనే పరిశీలించాలని ఆదేశించింది.

ఆరోగ్యపరంగా బాగున్నవారిని అనుమతించాలని చెప్పింది. ఆరోగ్యంగా లేనివారిని క్వారంటైన్ కు తరలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్వారంటైన్ అవసరం లేకపోతే గృహనిర్బంధంలో ఉంచాలని, ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచింది.

Related posts