telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆగస్టు నుంచి సీఎం జగన్ గ్రామాల పర్యటన

cm jagan ycp

ఏపీ సీఎం జగన్ ఆగస్టు నెల నుంచి గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలు, అమల్లో ఉన్న విధివిధానాలపై ఆయన ఇవాళ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు మాసం నుంచి గ్రామాల్లో పర్యటించనున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు.

అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాలన్నీ అందాలన్నదే తమ లక్ష్యమనిస్పష్టం చేశారు. తన పర్యటనలో సంక్షేమ పథకాలు అందలేదని ఏ ఒక్కరు , ఫిర్యాదు చేసినా అందుకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదట పింఛన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు.

Related posts