telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సంక్షేమ పథకాలు పేదలకు ఎంతో ఆసరా: మంత్రి మల్లారెడ్డి

Minister Mallareddy letter pad soial media |

పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ మండల పరిధిలో మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను 92 మంది లబ్దిదారులకు మంత్రి ఈ రోజు స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని తెలిపారు. పెండ్లి కానుకగా రూ. 1,00,116 ఇస్తున ఏకైక ప్రభుత్వం మన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమని చెప్పారు. పుట్టిన శిశువులకు కేసీఆర్‌ కిట్‌ అందజేయడం మొదలుకొని ఆడపిల్ల పెళ్లి చేసేవరకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

Related posts