telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమిత్ షాకు జగన్ ఇచ్చిన వినతిపత్రంపై.. సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు

4 directors arrested from sujana chowdary offices

ఏపీ సీఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఇచ్చిన వినతిపత్రంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాకు జగన్ ఇచ్చిన వినతిపత్రం నిరాధారమైనదని అన్నారు. జగన్ ఇప్పటి నుంచే ఓట్ల రాజకీయం ప్రారంభించారని అర్థమవుతోందని విమర్శించారు. పోలవరం పరిణామాలపై కేంద్ర జలశక్తి శాఖ అసంతృప్తిగా ఉందని సుజనా తెలిపారు.

అద్దె ఇంటికి, సొంత ఇంటికి ఒకే టెండరు పిలిచినట్టు పోలవరం టెండర్లు పిలిచారని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాజధానిలో రూ.9 వేల కోట్ల పనులు జరిగితే రూ.30 వేల కోట్ల దుబారా ఎలా సాధ్యమని అడిగారు. రెవెన్యూ లోటుపై గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే ఇప్పుడు జగన్ ప్రభుత్వం కూడా చెబుతోందని సుజనా ఆరోపించారు.

Related posts