యాదాద్రి జిల్లా..యాదగిరిగుట్ట లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గర్బగుడి విమాన గోపుర బంగారు తాపడం కోసం రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి భారీ విరాళం అందజేశారు. సుమారు ఏడున్నర కిలోల బంగారానికి సంబంధించి 3 కోట్ల 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు.
అంతకుముందు తొలి విడతలో అక్టోబర్ 20న మూడున్నర కిలోల బంగారానికి సంబంధించి కోటి 83 లక్షల రూపాయలు విరాళాన్ని అందజేసి, మంత్రి మల్లారెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటి వరకు 10 కిలోల బంగారానికి గానూ మొత్తం 4కోట్ల 93 లక్షల రూపాయలను ఆయన యాదగిరిగుట్ట ఈవో గీతారెడ్డికి అందజేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి దంపతులు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.