యంగ్ హీరో అడివి శేష్ నటించిన చిత్రం మేజర్ . ఈ సినిమా జూన్ 3 ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు శశి కిరణ్ తిక్క.
శశి కిరణ్ తిక్క. మేజర్ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్తో 325 లోకేషన్స్లో విడుదలైంది.ఈ సినిమా చూసిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మేజర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా చిత్రం బృందం ఈ మూవీ నుంచి ఓ ఎమోషనల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేశారు. ‘కన్నా కన్నా’ అంటూ సాగే ఈ పాటలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం నుంచి సైన్యంలో చేరేందుకు బయలుదేరే పలు సన్నివేశాలను చూపించారు.
రామజోగయ్య శాస్త్రీ రచించిన ఈ పాటకు శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకుర్చగా.. ప్రముఖ గాయనీ చిత్ర ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అలా హరీష్ శంకర్ హిట్ కొడితే ఇండస్ట్రీ వదిలేస్తా… బండ్ల గణేష్ ఫైర్