సీనియర్ రాజకీయవేత్త, స్వర్గీయ ఎన్టీయార్ పెద్దల్లుడు పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం గుండెపోటుకు గురయ్యారు.
వెంటనే స్పందించిన ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. దగ్గుబాటికి చికిత్స అందించిన వైద్యులు ఆయన గుండెలో స్టెంట్ను అమర్చారు.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు హుటాహుటీన అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. దగ్గుబాటిని చంద్రబాబు పరామర్శించారు. దగ్గుబాటి ఆరోగ్యంపై చంద్రబాబు అపోలో ఆసుపత్రి వైద్యులను వివరాలు తెలుసుకున్నారు.
విభజన వల్ల రాజధానిని నష్టపోయాం: మంత్రి ధర్మాన