ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం 12:21 నిమిషాలకు వేణుమాధవ్ తుదిశ్వాస విడిచారు. దీంతో టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఆయన రాణించారు. పలు కార్యక్రమాలకి ఆయన యాంకర్గా కూడా పని చేశారు. రాజకీయాలలోను చురుకుగా పని చేవారు. దాదాపు 600కి పైగా సినిమాలలో నటించిన వేణు మాధవ్ హంగామా, భూ కైలాస్ చిత్రాలలో హీరోగా చేశారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్య కారణాల వలన ఐదేళ్లుగా సినిమాలకి దూరంగా ఉన్నారు వేణు మాధవ్. చివరిగా రుద్రమదేవి చిత్రంలో కనిపించారు. ఈ సందర్భంగా అనుష్క, వేణుమాధవ్ అకాలమరణంపై దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ఆయనతో ఉన్న మెమరీస్కు సంబంధించిన వీడియోని షేర్ చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. “వేణుమాధవ్గారి అకాల మరణవార్త విని చాలా బాధ కలిగింది. నా మొదటి సినిమా ‘సూపర్’ నుంచి ఆయనతో మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక ప్రతిభ కలిగిన ఉత్తమ కమెడియన్లలో ఆయన ఒకరు. వేణుమాధవ్గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అని అనుష్క పేర్కొన్నారు.
next post