వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే అనుమానితులను 20 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ కేసు పై కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదివారం రాత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివేకా హత్యపై అనేక వివరాలు వెల్లడించారు. రాత్రి సమయంలో 11.30 గంటలకు ప్రచారం నుంచి ఇంటికి వచ్చారని, అయితే ఉదయం కల్లా ఆయన విగతజీవుడిలా కనిపించినట్టు తెలిసిందని అన్నారు.
అయితే మొదట రక్తం వాంతి చేసుకుని కమోడ్ కు గుద్దుకుని చనిపోయినట్టు చెప్పారని, దాంతో ఆ విధంగానే కేసు నమోదైందని తెలిపారు. కానీ పోస్టుమార్టంలో గాయాలు బయటపడడంతో ఇది హత్య అని తేలిందని చెప్పారు. అప్పటికి సాయంత్రం అయిందని, వివేకా కుమార్తె సునీత.. పీఏ కృష్ణారెడ్డి ద్వారా లేఖను పోలీసులకు అందించారని వివరించారు. అయితే వివేకా ఇంట్లో దొరికిన లేఖలో ఉన్న చేతిరాత తన తండ్రిదేనని సునీత అంగీకరించినట్టు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. ఆ లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించామని వెల్లడించారు.
రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుంది: కన్నా