telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రావణి ఆత్మహత్య కేసు… పోలిసుల చేతికి కీలక ఆధారాలు

Shravani

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి (26) ఆత్మహత్య కేసు ఆమె స్నేహితులు దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి (సాయి) చుట్టూనే తిరుగుతోంది. దేవరాజు, సాయి… ఇద్దరి మూలంగా తీవ్ర మానసిక వేదనకు గురై శ్రావణి ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. తాజాగా శ్రావణి ఆత్మహత్య కేసు విచారణలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి, సాయి మధ్య వాగ్వాదం జరిగినట్లు గుర్తించారు. రోడ్డుపై శ్రావణిని సాయి బెదిరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. ఆత్మహత్యకు ముందు రోజు శ్రావణి, సాయిల మధ్య జరిగిన వివాదం కీలకం కానుంది. శ్రావణిని సాయి సీరియస్‌గా బెదిరించినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా తెలుస్తోంది. శ్రావణిని ఆటోలో తీసుకెళ్లేందుకు సాయి ప్రయత్నించాడు. చివరకు ఆటో ఎక్కేందుకు శ్రావణి నిరాకరించడంతో.. రోడ్డు మీదే ఆమెతో గొడవ పడ్డాడు. బెదిరింపులు తట్టుకోలేక చివరికి శ్రావణి ఆటోలో వెళ్లింది. రేపు ఎస్సార్ నగర్ పోలీసుల ముందు విచారణకు సాయి హాజరుకానున్నాడు. రెస్టారెంట్‌లో సాయి తనపై దాడి చేశాడని శ్రావణి చెప్పిన ఆడియో సైతం ఈ కేసులో కీలకంగా మారనుంది.

Related posts