telugu navyamedia
వార్తలు సామాజిక

దేశంలో కొనసాగుతున్న కోవిడ్.. కొత్తగా 97,570 మందికి పాజిటివ్

corona covid

దేశంలో క‌రోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 97,570 మందికి కరోనా సోకిందని పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985కు చేరింది.

దేశ వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల సమయంలో 1,201 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 77,472కు పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 36,24,197 మంది కోలుకున్నారు. 9,58,316 మంది ప్రస్తుతం ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Related posts