telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జలకళతో కుప్పం నియోజకవర్గం కళకళలాడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు తలపెట్టిన కుప్పం పర్యటనలో తొలి రోజు అగస్త్య అకాడెమీలోని టీచర్ ట్రైనింగ్ సెంటర్ను చంద్రబాబు ప్రారంభించారు.

జలకళతో కుప్పం నియోజకవర్గం కళకళలాడుతోంది. హంద్రీ-నీవా కాలువల ద్వారా వచ్చిన కృష్ణమ్మతో చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి.

శిక్షణ తీసుకుంటున్న టీచర్లతో చంద్రబాబు మాట్లాడారు.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థులు కొత్త ఆలోచనలు చేసేలా అగస్త్య అకాడెమీ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఉన్నాయి అని అన్నారు. అలాగే కంగుందిలో బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించారు.

ఈ పార్కు కుప్పంలో టూరిజం అభివృద్దికి సహాయ పడుతుంది అని అన్నారు. అనంతరం కుప్పం పట్టణంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను, కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ప్రారంభించారు.

రాష్ట్రంలోనే తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది అని చంద్రబాబు అన్నారు. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువతకు ఉద్యోగ-ఉపాధి కల్పించేందుకు దోహదపడుతుంది అని చంద్రబాబు అన్నారు.

Related posts