వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పంట పొలాలు సాగుచేసుకోనివ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు వదిలిపెట్టి వెళ్లిపోవాలని టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, ఏమిటీ దౌర్జన్యం అంటూ ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగ వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.
వైసీపీ వేధింపులకు నిరసనగా టీడీపీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతుందన్నారు. సెప్టెంబరు 3 నుంచి గుంటూరులో వైసీపీ బాధితుల పునరాశ్రయ శిబిరం నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు ట్విట్టర్ లో వెల్లడించారు. పల్నాడు, ఇతర ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల దాడుల కారణంగా నివాసాలు కోల్పోయిన బాధితులందరికీ గుంటూరులో ఏర్పాటు చేసే శిబిరంలో ఆశ్రయం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.
వెయ్యి కోట్లు ఇచ్చినా.. అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవి ఇవ్వదు: జగ్గారెడ్డి