ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న టెస్టుమ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
విజయమే లక్ష్యంగా టీమిండియా జట్టు సర్వ సన్నద్ధమైందని విరాట్ కోహ్లీ తెలిపారు. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరచి టెస్టుమ్యాచ్ లో పట్టుసాధించేదిశగా అడుగులేస్తామని పేర్కొన్నారు.
ముంబయిలో రెండు రోజులుగా కురిసిన వర్షాలతో వాంఖడే స్టేడియం ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ ప్రారంభానికి ఆలస్యమైంది.
టీమిండియా తరఫున మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, చతేశ్వరపూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ బరిలో దిగారు.
న్యూజిలాండ్ జట్టు తరఫున టామ్ లేథమ్, విల్ యంగ్, డేరీ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, రచిన్ రవీంద్ర, కేల్ జెమీసన్, టిమ్ సౌధీ, విలియం సోమ్రిల్లే, అజాజ్ పటేల్ రంగంలోకి దిగారు.
సంజయ్ మంజ్రేకర్ కు బీసీసీఐ షాక్.. కామెంటరీ ప్యానల్ లో దక్కని స్థానం!