భారత్కు చెందిన అనీష్ కుమార్ సురేంద్రన్ పిళ్లై, వీరేందర్లు ప్రపంచ మిలిటరీ క్రీడల్లో స్వర్ణాలతో సత్తా చాటారు. పారా అథ్లెటిక్స్ పురుషుల షాట్పుట్లో పిళ్లై ఐఎఫ్1 విభాగంలో 12.76మీటర్లు విసిరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఆరు రౌండ్ల పోటీలో నాల్గో రౌండ్లోనే పిళ్లై విజేతగా నిలిచాడు.
పెరూకు చెందిన కార్లోస్(10.47మీ.) రజిత పతకం గెల్చుకోగా… 9.93మీటర్లు విసిరిన నెదర్లాండ్స్కు చెందిన రాబర్ట్కు కాంస్య పతకం దక్కింది. ఇక షాట్పుట్ ఐఎఫ్5 కేటగిరీలో వీరేందర్ 11.43మీ.లో బంగారు పతకాన్ని గెల్చుకున్నాడు. ఫ్రాన్స్కు చెందిన నికోలస్కు రజితం, సుమ పియరో(ఇటలీ)కి కాంస్య పతకం దక్కింది.