దుబాయ్, షార్జా వేదికల్లో జరిగే మ్యాచ్ లకు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కు స్థానం దక్కలేదు. ఐపీఎల్ కోసం ఏడుగురు సభ్యులతో కూడిన కామెంటరీ ప్యానల్ లో మంజ్రేకర్ కు బీసీసీఐ చోటు కల్పించలేదు. ఈ ప్యానల్ లో గవాస్కర్, మురళీ కార్తీక్, దీప్ దాస్ గుప్తా, శివరామకృష్ణన్, రోహన్ గవాస్కర్, హర్ష భోగ్లే, అంజుమ్ చోప్రాలకు చోటు కల్పించారు.
మురళీ కార్తీక్, దాస్ గుప్తాలు అబుదాబిలో కామెంటేటర్లుగా వ్యవహరించనున్నారు. మిగిలిన వారు దుబాయ్, షార్జా వేదికల్లో కామెంటేటర్లుగా ఉంటారు. అబుదాబి, దుబాయ్ లలో 21 మ్యాచ్ లు, షార్జాలో 14 మ్యాచ్ లు జరగనున్నాయి.