telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎన్టీఆర్ ఆత్మ క్షోబించెలా చంద్రబాబు చేశాడు : కొడాలి నాని

మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ… హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 మంది అభ్యర్థులను నిలబెట్ట లేకపోవడం చంద్రబాబునాయుడు అసమర్ధత. పోటీ చేసిన 106 మంది కార్పొరేట్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయి, ఒక్క శాతం కూడా ఓట్లు సాధించలేని టీడీపీని జాతీయ పార్టీ అని ప్రకటించుకోవడం హాస్యాస్పదం అని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోబించెలా,  తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు పూర్తిగా పతనం చేశాడు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు, ప్రజా నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఢీ కొడతాననడం అవివేకం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుంది అని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కోర్టులకు వెళ్లడం వల్లనే, ఇసుక రీచ్ ల్లో, తవ్వకాలు నిలిచి రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడుతుంది. వ్యవస్థలను అడ్డంపెట్టుకొని రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటుంది. హైదరాబాద్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రాష్ట్రంలో జరిగే రాబోవు ఎన్నికల్లో, టీడీపీకి పునరావృతం అవుతాయి అని తెలిపారు. తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గాలి పార్టి గా తయారుచేసి, ఆయన ఒక గాలి నాయకుడిగా మిగిలిపోయాడు. చంద్రబాబునాయుడు, నాయకుడిగా ప్రజల తిరస్కారానికి గురయ్యి, ఒక మేనేజర్ మాదిరి మిగిలిపోయాడు. జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి, చంద్రబాబు కుక్క మాదిరి ఏడుస్తున్నాడు అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

Related posts