ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగుతోంది. ఉదయాన్నే ఆర్టీసీ బస్టాండ్ల వద్దకు చేరుకున్న కార్మికులు ఆందోళనకు దిగారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె 9వ రోజుకు చేరుకుంది.
ఖమ్మం జిల్లాలోని బస్టాండ్లు, డిపోల వద్ద ఆందోళనకు దిగిన కార్మికులు బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికుల బంద్కు ప్రతిపక్షాలతోపాటు వివిధ కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించడంతో ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది విధులకు వచ్చేందుకు భయపడుతున్నారు.
“కాళేశ్వరం” నుంచి బొట్టు నీరు కూడా వినియోగంలోకి రాలేదు: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి