వచ్చే నెల రెండో వారంలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ వ్యాల్యుయేషన్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ..కేబినెట్ నిర్ణయం మేరకు ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12 నుంచి ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు.
వాల్యుయేషన్కు గతంలో 12 సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 సెంటర్లకు పెంచినట్లు చెప్పారు. పేపర్ వాల్యుయేషన్కు వచ్చే లెక్చరర్స్కు రవాణా సౌకర్యం, వసతి కల్పిస్తామన్నారు.కరోనా ప్రభావంతో పదో తరగతి పరీక్షలు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు మళ్లీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కోర్టు అనుమతి రాగానే వారికి అన్ని వసతులు కల్పించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.