telugu navyamedia
రాజకీయ వార్తలు

ఎగ్జిట్‌పోల్స్ తో ఫుల్ జోష్ ..ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌కు అమిత్ షా విందు

TDP Mla anitha comments Roja YCP

కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాబోతోందని ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుల్ జోష్ లో ఉన్న ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌కు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా విందు ఏర్పాటు చేశారు. మంగ‌ళ‌వారం ఢిల్లీలో జరిగే ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రులు కూడా హాజ‌రుకానున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈనెల 23న వెలుబ‌డ‌నున్నాయి. ఎక్కువ‌శాతం ఎగ్జిట్‌పోల్స్ ఎన్డీయే కూట‌మికి 300 సీట్లు దాటుతాయ‌ని అంచ‌నా వేశాయి.

న్యూస్‌24 చాణ‌క్య స‌ర్వే ప్ర‌కారం ఎన్డీయేకు 350 సీట్లు రానున్నాయి. ఆజ్‌త‌క్‌-ఇండియా టుడే ప్ర‌కారం 339 నుంచి 365 సీట్లు రానున్నాయి. న్యూస్‌18 ప్ర‌కారం 336 సీట్లు వ‌స్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 సీట్లలో బీజేపీకి గరిష్టంగా 57 స్థానాల వరకు రావొచ్చని ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. మహాకూటమికి 40 సీట్లు దాకా వచ్చే అవకాశముందని తెలిపాయి.

Related posts