telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇది మనల్ని వేటాడుతూనే ఉంటది: కేసీఆర్

KCR cm telangana

కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించగా విపక్షాలు విమర్శలు గుప్పించాయి. నిన్న తన మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ రేపో, ఎల్లుండో పోయే సమస్య కాదని అన్నారు. వైరస్ తో ప్రజలు కలసి బతకాల్సిందేనని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఫైనల్ గా కరోనా మనం కలసి బతకాల్సిందేనని చెప్పారు.ఉపాయం ఉన్నోడు అపాయం నుంచి తప్పించుకుంటడు. కాబట్టి మనం ఉపాయంతోని బతకాలని సూచించారు. వారం రోజులకు మనం దాటిపోయే గండం కాదు. ఇది మనల్ని వేటాడుతూనే ఉంటదన్నారు. వైద్యులు, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తరువాతనే రాష్ట్రంలో లాక్ డౌన్ ను ప్దగించామని అన్నారు.

Related posts