ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కె. కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వరుసగా విచారిస్తున్న అవినీతి మరియు మనీలాండరింగ్ కేసులలో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు బిఆర్ గవాయ్ మరియు కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన బెంచ్ కవితకు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని బెంచ్ వ్యాఖ్యానించింది.
ఈడీ, సీబీఐ.. రెండు కేసుల్లోనూ బెయిల్ ఇచ్చింది. నిందితురాలు మహిళ అనే విషయం కూడా దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.
దీంతో ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత నేడు బయటకు రానున్నారు.
కాగా, ఈ కేసులో కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్జీ వాదనలు వినిపించారు.