telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మోదీ సందేశంపై క‌మ‌ల్ ఆగ్రహం

pm modi kamal

భార‌త ప్ర‌ధాన న‌రేంద్ర మోదీ నిన్న ఉద‌యం దేశ ప్రజలనుద్దేశించి ఓ వీడియో సందేశం ఇచ్చారు. ఏప్రిల్ 5 రాత్రి 9 గం.ల‌కి ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి 9నిమిషాల పాటు దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలని ప్ర‌జ‌ల‌ని కోరారు. ఈ వెలుగులో క‌రోనా చీక‌ట్ల‌ని తొల‌గించాలని మోదీ పిలుపు నిచ్చారు. అయితే మోదీ సందేశాన్ని ప‌లువురు ప్ర‌ముఖులు ఖండిస్తున్నారు.

ఈనేపథ్యంలో మక్కల్ నీది మయ్య‌మ్‌ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా మోదీ కామెంట్స్ పై మండిప‌డ్డారు. అంద‌రం విపత్క‌ర ప‌రిస్థితుల‌పై దిశా నిర్ధేశం చేస్తార‌ని ఊహించాం. పేద‌ల‌కి జీవ‌నాధారం, ఆర్ధిక మాంద్యం, వ‌స్తువుల ల‌భ్య‌త గురించి మాట్లాడుతార‌ని అనుకున్నాం. కాని మేమెప్పుడో ప్రారంభించిన టార్చ్‌లైట్ పోరాటం గురించి మాట్లాడారు అని త‌న ట్వీట్‌లో క‌మ‌ల్‌ పేర్కొన్నారు.

Related posts