సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరెప్పుడు సెలబ్రిటీ అవుతున్నారో అర్థం కావడం లేదు. అప్పటి వరకు ఎవరికీ తెలియని వాళ్లు ఒక్కసారిగా ఫేమస్ అవుతున్నారు. అందులో పల్లీలు అమ్మకునే ‘కచ్చా బాదామ్’ సింగర్ భుబన్ బద్యాకర్ ఒకరు.‘కచ్చా బాదామ్’ సాంగ్తో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు.
పశ్చిమ బెంగాల్లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. ఆయనకు ముగ్గురు పిల్లలున్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే డబ్బులతోనే జీవనం సాగిస్తున్నాడు ఈయన. అలా ఆయన పల్లీలు అమ్ముకునే సమయంలో కచ్చా బాదామ్ అంటూ పాడిన పాటే జీవితాన్ని మార్చేసింది.
ఈయన బీర్భూమ్ జిల్లాలోని పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ సాధారణ వీధి వ్యాపారి. ఊరూరా తిరుగుతూ పల్లీలు తీసుకోండి అంటూ అరుస్తూ ఆయన పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఊహించని విధంగా దీనికి రెస్పాన్స్ వచ్చింది. అతని పాట తర్వాత రీమిక్స్ చేయబడింది మరియు యూట్యూబ్లో అప్లోడ్ చేయబడింది.
దేశవ్యాప్తంగా కచ్చా బాదమ్ పాటకు రీల్స్ చేస్తున్నారు. ఇన్స్టాలో అయితే రీల్స్ విపరీతంగా చేస్తున్నారు. ఈ పాటను డిజే చేస్తే దానికి కూడా 50 మిలియన్ వ్యూస్కు పైగానే వచ్చాయి. ఈ ఒక్క పాటతో పల్లీల వ్యాపారి జీవితమే మారిపోయింది.
కచా బాదం గాయకుడు భుబన్ బద్యాకర్ ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన సూరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు.
ఇటీవల అతను కచ్చాబాదమ్ పాటతో వచ్చిన రెమ్యునరేషన్తో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు. ఇటీవల కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును ఎలా నడపడం నేర్చుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఛాతిలో గాయం కావడంతో ప్రస్తుతం సూరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం భూబన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. భుబన్ బద్యాకర్ను ఇటీవల పశ్చిమ బెంగాల్ పోలీసులు సత్కరించారు.
ఆ సినిమా అద్భుతం.. ట్వీట్ చేసిన కేటీఆర్!