telugu navyamedia
సినిమా వార్తలు

‘బింబిసార’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో విషాదం ..అభిమాని మృతి

బింబిసార ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి అభిమాని ఒకరు మృతి చెందాడు.

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌ చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం ‘బింబిసార’.ఈ సినిమా ఆగష్టు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శుక్ర వారం హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగింది

ఈ కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్యఅతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా నందమూరి హీరోలను చూసేందుకు నందమూరి అభిమానులు హైదరాబాద్‌కు శిల్పకళావేదికకు తరలి వచ్చారు.

ఈ క్రమంలో సాయిరాం అనే అభిమాని అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. అతడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

కాగా మృతుడి పూర్తి పేరు పుట్టా సాయిరాం అని అతడు తాడేపల్లిగూడెనికి చెందిన వ్యక్తి అని తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ సంస్థలో జాబ్‌ చేస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం సాయిరాం మృతదేహం ఉస్మానియా ఆస్పత్రిలోనే ఉందని, ఈ ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Related posts