telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కౌలు రైతులను కులం ఎందుకు అడుగుతున్నారు: పవన్‌కల్యాణ్‌

pawan-kalyan

రైతు కన్నీరు ఆగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర ధాన్యం కొని రశీదులు ఇవ్వలేదని, కొన్న ధాన్యానికి ఇంతవరకు డబ్బు చెల్లించలేదన్నారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు.

సభలో విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయొద్దని సూచించారు. ధాన్యానికి బస్తాకు రూ.1300 కాదని, రూ.1500 ఇవ్వాలని కోరారు. రూ.1500 ఇస్తే చేసిన తప్పుకు క్షమాపణ చెప్పినట్టు అవుతుందన్నారు. మీకు కులం పట్టింపులేకపోతే… కౌలు రైతులను కులం ఎందుకు అడుగుతున్నారని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు.

Related posts