telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ: సీఎం జగన్

cm jagan ycp

హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను అందిస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. వైద్య, ఆరోగ్య రంగాలపై ఈరోజు జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 42 లక్షల కుటుంబాలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని చెప్పారు. రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేశామని తెలిపారు. వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని చెప్పారు.

జూలై 8 నుంచి మరో ఆరు జిల్లాలకు సేవలను విస్తరింపజేస్తామని తెలిపారు. మరో ఆరు జిల్లాల్లో దీపావళి నుంచి అమలు చేస్తామని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటే భయం వేసేదని. కానీ ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో మందులు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి, వైద్యం చేయించుకోవచ్చని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేల వరకు పెన్షన్లను ఇస్తున్నామని చెప్పారు.

Related posts