ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఆయనను “దగా, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్” అని అభివర్ణించారు.
వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకముందే, గత ప్రభుత్వం హడావిడిగా ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు.
ప్రాజెక్టు ఇంకా అసంపూర్తిగా ఉండగా పూర్తయిందని చెప్పడం ప్రజలను వంచించడమేనని, అందుకే జగన్ మోసాలకు ప్రతిరూపమని విమర్శించారు.
సొంత తల్లి, చెల్లిని మోసం చేసిన వ్యక్తికి ప్రజలను మోసం చేయడం లెక్కకాదు అని విమర్శించారు.
తన ఐదేళ్ల పాలనలో జగన్ రాయలసీమ ప్రయోజనాలను గాలికి వదిలేశారని, నీటిపారుదల ప్రాజెక్టులపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
తిరుమల ప్రతిష్ఠను దబ్బతీసేలా జగన్ కుట్రలు చేస్తున్నారని, పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో అపవిత్రతకు కారణమయ్యారని నిమ్మల విమర్శించారు.
వైకాపా నాయకులు అబద్ధాలను అభూతకల్పనలను ప్రచారం చేయడంలో దిట్టలని, జగన్ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని మండిపడ్డారు.

