telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అదరింది’ షోకు రెట్టింపు పారితోషకం తీసుకుంటున్న నాగబాబు

Nagababu

తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ స్థాపించి..మొదటి సినిమాగా ‘రుద్రవీణ’ సినిమాను తెరకెక్కించాడు. కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి పేరు వచ్చినా కమర్షియల్‌గా విజయవంతం కాలేదు. ఆ తర్వాత ‘త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు తెరకెక్కాయి.మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును కోలుకోలేని విధంగా దెబ్బతీసాయి. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు పాపులారిటీ పెరిగింది. అదే సమయంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో నాగబాబు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. ఐతే.. జబర్ధస్త్ షోలో ఒక్కో షోకు దాదాపు రూ.5 లక్షలు ఛార్జ్ చేసే నాగబాబు. ఇపుడు జీ తెలుగులో ప్రసారమయ్యే ‘అదరింది’ షోకు మాత్రం అంతకు రెట్టింపుగా పారితోషకం అందుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ అంతగా సక్సెస్ కాలేకపోయినా… నాగబాబు తన ఆస్తులు పెంచుకునే విషయంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇందులో వచ్చిన రెమ్యునరేషన్‌తో నాగబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్టు సమాచారం. అక్కడైతే కొన్ని ఒడిదుడుకులు ఎదరైన డబ్బులకు ఎలాంటి ఢోకా ఉండదనే ఉద్యేశ్యంతో అందులో పెట్టినట్టు సమాచారం. ఇక ‘అదిరింది’ ప్రోగ్రామ్ విషయానికొస్తే.. ఇపుడిపుడే కాస్త రేటింగ్స్ వస్తున్నాయి. భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలున్నాయనే ఆశతోనే ఈ ప్రోగ్రామ్‌ను కంటిన్యూ చేస్తున్నట్టు సమాచారం.

Related posts