telugu navyamedia
సాంకేతిక

పీఎస్ఎల్వీ సి-52 రాకెట్ సక్సెస్..

పీఎస్ఎల్‌వీ సీ 52 ర్యాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడాది తొలి ప్రయోగాన్ని చేపట్టింది. సరిగ్గా 5 గంటల 59 నిముషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సి-52 రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగికెగిసింది.

ఆదివారం వేకువజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం కాగా.. నిరంతరాయంగా 25 గంటల 30నిముషాలపాటు కౌంట్ డౌన్ కొనసాగింది. పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ మొత్తం 3 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశ పెడుతుంది.

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ప్రయోగం ఇది. ఈ ఏడాదికి కూడా ఇదే తొలి ప్రయోగం.

పీఎస్‌ఎల్‌వీ సీ52 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో శాస్త్రవేత్తలు సంబరాల చేసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని స్వీట్లు పంచుకున్నారు. ఈ ఏడాది నెల్లూరులోని షార్ నుంచి జరిపిన తొలి ప్రయోగం విజయవంతమయింది.

పీఎస్‌ఎల్‌వీ సీ52 అనేక ప్రయోజనాలున్నాయి. పదేళ్ల పాటు కక్షలో ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులలోనైనా 24 గంటలూ పనిచేసేలా శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ సమాచారం తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ఇనస్పైర్ శాగ్ -1 ను వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు రూపొందించారు. దీని బరువు 81. కిలోలు మాత్రం. ఏడాది కాలం మాత్రమే దీని జీవితకాలం. ఇక ఐఎన్ఎస్ – 2 డీ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ లు కలసి రూపొందించాయి. దీని జీవితకాలం ఆరునెలలు. భవిష్యత్ సైన్సు, పేలోడ్స్ కోసం కూడా దీనిని రూపొందించారు.

మ‌రోవైపు.. పీఎస్ఎల్‌వీ సీ 52 విజయవతం కావడంతో ప్రధానితో సహా ప్రముఖలందరూ భారత శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Related posts